Header Banner

పల్లె సంక్షేమానికి ప్రజలే మార్గదర్శకులు.. పంచాయతీ రాజ్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు!

  Thu Feb 13, 2025 10:31        Politics

గ్రామీణ ప్రజల అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా గ్రామాలకు సుపరిపాలన అందించవచ్చని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌ బుధవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ గ్రామసభల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజలకు ఏమి అవసరమో తెలుస్తుందన్నారు. గ్రామ పాలన అందించే స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు మండలాలకు చెందిన 15 పంచాయతీలను ఎంపిక చేసినట్లు తెలిపారు.


ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!


వికసిత్‌ పంచాయత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల సామర్థ్యం పెంపొందించేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్ణయించింది. అందుకు వ్యూహాత్మక కార్యాచరణ కోసం ఆంధ్రప్రదేశ్‌, అసోం, గుజరాత్‌, ఒడిసా రాష్ట్రాలను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి వర్క్‌షాపు నిర్వహించారు. వర్క్‌షాపులో అడిషనల్‌ కమిషనర్‌ సుధాకర్‌రావు, అల్లూరి జిల్లా జడ్పీ సీఈవో, జడ్పీపీపీ, డీపీవో, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినాగుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #village #development #todaynews #Flashnews #latestupdate